ADB: విద్యార్థులు ఉన్నత చదువుల కోసం ఆదిలాబాద్ జిల్లాలోనే ప్రభుత్వ యూనివర్సిటీని ఏర్పాటు చేయాలనీ పలువురు విద్యార్థులు కోరారు. శుక్రవారం నేరడిగొండలో రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు పర్యటనలో భాగంగా ఆయనకు వినతి పత్రం అందజేశారు. యూనివర్సిటీని నిర్మల్కు తరలించే ప్రతిపాదనను విరమించుకోవాలన్నారు. అదేవిధంగా జిల్లాలో ST స్టడీ సర్కిల్ ప్రారంభించాలన్నారు.