NGKL: కల్వకుర్తి మండలంలోని గుంటూరు గ్రామానికి చెందిన తుప్పల సత్యనారాయణకు మంజూరైన సీఎం సహాయనిధి చెక్కును స్థానిక కాంగ్రెస్ నాయకులు ఇవాళ అందజేశారు. బాధితుడు అనారోగ్యంతో బాధపడుతూ.. ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందగా ఎమ్మెల్యేలు కసిరెడ్డి నారాయణరెడ్డి సహకారంతో రూ. 60 వేల సీఎం సహాయనిధి చెక్కు మంజూరు అయినట్లు తెలిపారు.