KMR: పాల్వంచ మండలం ఫరీద్పేటలో ఏర్పాటు చేసిన గ్రంథాలయాన్ని ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణ రెడ్డి శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రంథాలయాలు విజ్ఞాన గనులని, పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే నిరుద్యోగులకు ఇవి ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు. విద్యార్థులు, యువత పుస్తకాలను చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని పిలుపునిచ్చారు.