KMM: కృష్ణా జిల్లా కలగర గ్రామానికి చెందిన రావుల అప్పారావు కోదాడ వెళ్తూ మధిర శాంతి థియేటర్ సమీపంలో తన వద్ద ఉన్న రూ.60 వేలు పోగొట్టుకున్నారు. బాధితుడి ఫిర్యాదుతో ఐఓపీ డి.రమేష్ ఆదేశాల మేరకు పోలీసులు సీసీ కెమెరాలను పరిశీలించారు. కేవలం 30 నిమిషాల్లోనే నగదును గుర్తించి బాధితుడికి అందజేశారు. సమయస్ఫూర్తితో వ్యవహరించిన కానిస్టేబుళ్లును ఐఓపీ అభినందించారు.