MDK: ఆర్థిక సంవత్సరం ముగుస్తున్న నేపథ్యంలో 100% ఆస్తి పన్ను వసూలు చేయాలని మెదక్ మున్సిపల్ ఛైర్పర్సన్ కానుగు రాధిక భూపతి రాజు అధికారులను ఆదేశించారు. గురువారం వైస్ ఛైర్మన్ దొంతి నరేష్ గౌడ్, రెవెన్యూ సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. నిర్ణీత లక్ష్యాలను సకాలంలో పూర్తి చేయాలని, విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు.