KDP: వేంపల్లి (M)లోని బక్కన్నగారి పల్లెకు చెందిన రైతు రెడ్డి బోయిన సూర్యనారాయణ (30) అప్పుల బాధ తట్టుకోలేక గురువారం ఆత్మహత్య చేసుకున్నాడు. ఆయనకు 2.50 ఎకరాల పొలం ఉండగా అరటి, మొక్కజొన్న, వేరుశనగ పంటలు సాగు చేసేవాడు. 5 బోర్లు వేసి రూ.12 లక్షలకు పైగా అప్పులు అయ్యాయి. పంటలకు దిగుబడి రాకపోవడం, గిట్టుబాటు ధరలు లేక చున్నీతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు.