GNTR: సచివాలయంలో గురువారం ‘ఎలక్ట్రిసిటీ బీసీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్’ క్యాలెండర్, డైరీని మంత్రి సవిత ఆవిష్కరించారు. రాష్ట్ర అభివృద్ధిలో ఉద్యోగుల పాత్ర కీలకమని, వారి సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆమె పేర్కొన్నారు. అధికారంలోకి రాగానే ప్రతి నెల 1వ తేదీనే ఉద్యోగులకు జీతాలు అందేలా చర్యలు తీసుకున్నామని ఈ సందర్భంగా మంత్రి గుర్తుచేశారు.