SGR: జిల్లాలో 99 రోజుల పాటు చేపట్టిన ‘ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక’ను విజయవంతం చేయాలని కలెక్టర్ ప్రావీణ్య అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రతి అర్హులైన పేదవాడికి చేరడమే లక్ష్యమని స్పష్టం చేశారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ పాండు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.