ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా నేటి నుంచి జూన్ 12 వరకు ఐదు దశల్లో 99 రోజుల పాటు ‘ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రతి అర్హులైన పేదవాడికి చేరడమే లక్ష్యంతో ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. జిల్లాలో జరిగే ఈ ప్రత్యేక డ్రైవ్ను విజయవంతం చేయాలని ఆయా జిల్లాల కలెక్టర్లు పేర్కొన్నారు.