టీ20 ప్రపంచకప్ 2026లో ఇంగ్లండ్పై విజయం సాధించి టీమిండియా ఫైనల్కు దూసుకెళ్లింది. ఈ నేపథ్యంలో టీమిండియాపై ఏపీసీసీ చీఫ్ షర్మిల ప్రశంసలు కురిపించారు. భారత్ విజయం మహాద్భుతమని తెలిపారు. ‘సెమీఫైనల్స్లో ఇంగ్లండ్ను ఓడించి.. ఫైనల్స్కు దూసుకెళ్లిన ఇండియా క్రికెట్ జట్టు సభ్యులకు అభినందనలు. ఫైనల్లో ఇండియా విజయం సాధిస్తుంది’ అని పోస్ట్ చేశారు.