సాహితీ ఇన్ ఫ్రా రియల్ ఎస్టేట్ కంపెనీ స్కామ్ కేసులో నటుడు జగపతిబాబు ED విచారణకు హాజరయ్యారు. సుమారు 4 గంటలపాటు ED అధికారులు ఆయనను విచారించారు. సాహితీ ఇన్ ఫ్రా సంస్థతో ఆయన జరిపిన లావాదేవీలపై ప్రశ్నించినట్లు తెలుస్తోంది. కానీ ఈ లావాదేవీలపై జగపతిబాబు సరైన సమాధానాలివ్వలేదని సమాచారం. కాగా, సాహితీ ఇన్ఫ్రా సంస్థను ప్రమోట్ చేస్తూ ఆయన పలు ప్రకటనల్లో నటించారు.