అన్నమయ్య: గురువారం MSP నేత సుధాకర్ బాబు అధ్యక్షతన పీలేరు రెవెన్యూ డివిజన్ ఏర్పాటుపై రౌండ్టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో టీడీపీ, బీజేపీ, జనసేన, వైఎస్ఆర్ కాంగ్రెస్, కాంగ్రెస్, సీపీఐ నేతలు పాల్గొన్నారు. పీలేరు, తంబళ్లపల్లె, పుంగనూరు, రోపిచెర్ల, పులిచెర్ల, గుర్రంకొండ, కేవీ పల్లి, యార్రవారి పాల్యం, చిన్న గొట్టిగల్లు మండలాలను కలిపి ఏర్పాటు చేయాలని కోరారు.