ప్రకాశం: వివిధ ప్రాంతాలలో ద్విచక్ర వాహనాలు చోరీకి పాల్పడుతున్న ఓ మైనర్ బాలుడితో పాటు ఇద్దరు వ్యక్తులను ఒంగోలు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఒంగోలు డీఎస్పీ శ్రీనివాసరావు తెలిపిన వివరాల మేరకు నిందితులు జల్సాలకు అలవాటు పడి ఇప్పటివరకు 19 ద్విచక్ర వాహనాలు చోరీ చేసినట్లు శ్రీనివాస రావు అన్నారు. కాగా, నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించామన్నారు