TPT: పెళ్లకూరు మండల పరిధిలో తుఫాన్ ప్రభావం కారణంగా భారీ గాలులు, వర్షాలు కొనసాగుతాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్సై కె. నాగరాజు సూచించారు. మండలంలో స్వర్ణముఖి నది ఉద్ధృతంగా ప్రవహిస్తుండడంతో నదీ పరివాహక గ్రామాల ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని తెలియజేశారు. అవసరం లేకుండా ఎవరూ బయటకు రావొద్దని తెలిపారు.