సత్యసాయి: సోమందేపల్లి మండలం చాలకూరు, కేతగానిచెరువు గ్రామపంచాయితీ, నడింపల్లి గ్రామపంచాయతీలలో మంగళవారం కోటి సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. మండల వైసీపీ కన్వీనర్ గజేంద్ర ఆధ్వర్యంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రజా మద్దతు కోరుతూ సంతకాలు సేకరించారు. ప్రతి ఒక్కరూ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకించాలని గజేంద్ర కోరారు.