కృష్ణా: తుఫాన్ నేపథ్యంలో ప్రభుత్వానికి సహకరించాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉందని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. తుఫాన్ ప్రభావంపై ప్రభుత్వం, కలెక్టర్ విస్తృత అవగాహన కలిగి ఉన్నారని ఆయన తెలిపారు. ఇంకా శిబిరాలకు రాకుండా లోతట్టు ప్రాంతాలు, బలహీన ఇళ్లలో ఉన్న వారు నిర్లక్ష్యం వీడి అధికారుల సూచనలు పాటించి పునరావాస కేంద్రాలకు చేరుకోవాలన్నారు.