రాజస్థాన్లోని జైపూర్-ఢిల్లీ రహదారిపై ఓ బస్సు దగ్ధమై ముగ్గురు ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. మరో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. బస్సు రన్నింగ్లో ఉండగా హైటెన్షన్ విద్యుత్ వైర్లు తగిలి మంటలు చెలరేగాయి. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఇటీవల జైసల్మేర్లో 26 మంది, రెండ్రోజుల క్రితం కర్నూలులో 19 మంది బస్సు ప్రమాదంలో మృతిచెందిన విషయం తెలిసిందే.