SKLM: ఆమదాలవలస మండలంలోని పలు గ్రామాలలో సీసీ రోడ్లు, కాలువలు నిర్మాణానికి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద రూ.6.03 కోట్లు నిధులు మంజూరయ్యాయి. ఈ మేరకు స్థానిక ఎమ్మెల్యే రవికుమార్ కార్యాలయం మంగళవారం ప్రకటనలో వెల్లడించింది. మొత్తం 100 పనులకు ఈ నిధులను కేటాయించినట్లు తెలిపారు.