KDP: మొంథా తుపాన్ ప్రభావంతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తొండూరు MRO రామచంద్రుడు సూచించారు. తుపాన్ సమయంలో విద్యుత్ తీగలు తెగిపోవడం, చెట్లు కూలిపోవడం వంటి ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని, ప్రజలు అవసరమైతేనే బయటకు వెళ్లాలని, పిల్లలు, వృద్ధులు సురక్షిత ప్రాంతాల్లో ఉండేలా చూడాలని ఆయన తెలిపారు.