KRNL: బనగానపల్లె మండలం శ్రీ నందవరం చౌడేశ్వరి దేవి మాత ఇవాళ ప్రత్యేక పుష్పలాంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. కార్తీక మాసం శుక్ల పక్షం సప్తమి ఆలయ అర్చకులు తెల్లవారుజామున ప్రత్యేకంగా సింగారించి ప్రాతఃకాల పూజలైన రుద్రాభిషేకం, కుంకుమార్చన, మహామంగల హారతులతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు తీర్థప్రసాదాలు పంపిణీ చేసి మహిళలు కార్తీక దీపాలు వెలుగించారు.