NLR: బుచ్చి పట్టణంలో గత 2 రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు గుడపల్లి కాలువలో వర్షపు నీరు నిలిచిపోయింది. దీంతో స్థానిక ప్రజలు అసౌకర్యానికి గురవుతున్నారు. విషయం తెలుసుకున్న వైసీపీ పట్టణ అధ్యక్షుడు, కౌన్సిలర్ షాహుల్ జేసీబీ సాయంతో కాలువ పూడికను తొలగించారు. మాజీ సీఎం జగన్, మాజీ ఎమ్మెల్యే ప్రసన్న ఆదేశాల మేరకు ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉంటారన్నారు.