ATP: శ్రీనగర్ కాలనీలోని నీరు-ప్రగతి పార్కును ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్, కమిషనర్ బాలాస్వామి పరిశీలించారు. వాకింగ్ ట్రాక్, జిమ్ పరికరాలు, బెంచీలు, కాంపౌండ్ వాల్ తదితర పనులు పూర్తిచేశామని పేర్కొన్నారు. వాకర్స్ సూచనల మేరకు షెడ్ వంటి సౌకర్యాలు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. నగరంలోని 28 పార్కులన్నింటినీ అభివృద్ధి చేస్తామని తెలిపారు.