NLG: ప్రజా సమస్యలను తక్షణమే పరిష్కరించే లక్ష్యంతో ప్రతి సోమవారం పోలీస్ గ్రీవెన్స్ డే నిర్వహిస్తున్నట్లు ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు. ప్రజల సౌకర్యార్థం జిల్లా పోలీసు కార్యాలయంలో గ్రీవెన్స్ డే నిర్వహించి, జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన సుమారు 37 మంది అర్జీదారులతో ఎస్పీ నేరుగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు.