సత్యసాయి: పుట్టపర్తిలోని శ్రీ సత్యసాయి పాలియేటివ్ కేర్ క్యాన్సర్ సెంటర్ను జిల్లా కలెక్టర్ శ్యాం ప్రసాద్ గురువారం సందర్శించారు. ఆసుపత్రిలోని వివిధ విభాగాలను పరిశీలించిన రోగులకు అందుతున్న వైద్య సేవలపై సంతృప్తి వ్యక్తం చేశారు. జిల్లాలో క్యాన్సర్పై అవగాహన పెంచి, ప్రాథమిక దశలోనే వ్యాధిని గుర్తించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.