AKP: ఎస్ రాయవరం మండలం ఉప్పరాపల్లి గ్రామంలో మండల విద్యాశాఖ అధికారి అబ్దుల్ కలాం విజ్ఞాన కేంద్రాన్ని గురువారం ప్రారంభించారు. గ్రామ ఎంప్లాయిస్ యూనియన్ సహకారంతో దీనిని ఏర్పాటు చేశారు. ఈ కేంద్రంలో విద్యార్థులు, నిరుద్యోగులకు అవసరమైన అన్ని పుస్తకాలు అందుబాటులో ఉంటాయన్నారు. దీనిని సద్వినియోగం చేసుకొని ప్రయోజకులు కావాలని సూచించారు.