VSP: జీవీఎంసీ 48వ వార్డు కొండ ప్రాంతపు సమస్యలు పరిష్కరించాలని కార్పొరేటర్ గంకల కవిత జీవీఎంసీ కమిషనర్ను కోరారు. గురువారం జీవీఎంసీ కార్యాలయంలో ఆయనను కలిసి వినతి అందజేశారు. కొండ ప్రాంతంలో జై భారత్ నగర్, శ్రీనివాస్ నగర్లో 72A/2, 75A/5, 75A/6 స్తంభాలు, ఇండ్లకు అతి దగ్గరలో ఉన్నాయని, వాటి తీగలు తగిలి గతంలో కొందరు మరణించారని, ఆ స్తంభాలను తొలగించాలన్నారు.