SRD: విద్యుత్ ప్రమాదంలో ఓ రైతు మృతి చెందిన సంఘటన కంగ్టి మండలం చాప్ట బి గ్రామంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన బాలాజీ రావు పాటిల్ గురువారం ఉదయం తన పొలానికి వెళ్లగా, అక్కడ చేనుకు ఉన్న కంచెకు కరెంటు షాక్ తగిలి మృతి చెందినట్లు తెలిపారు. ఈయన మృతి పట్ల గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. అయితే పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.