ATP: అనంతపురం అర్బన్ నియోజకవర్గ అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ CM చంద్రబాబును కోరారు. ఉండవల్లి నివాసంలో జరిగిన జిల్లా నేతల సమావేశంలో ఆయన ఇవాళ వినతిపత్రం అందజేశారు. నడిమి వంక, మరువ వంక రక్షణ గోడల నిర్మాణం కోసం రూ.79.46 కోట్లు, మున్సిపాలిటీ పెండింగ్ పనులు, శిల్పారామం మౌలిక వసతుల కోసం నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు.