AP: రెసిడెన్షియల్ స్కూళ్లలో లక్షా 4 వేలమంది విద్యార్థులు ఉన్నారని మంత్రి DSBV స్వామి వెల్లడించారు. వారికోసం 52 వేల పడకలు కావాల్సి ఉందన్నారు. ‘దశలవారీగా మంచాలు సమకూర్చే విషయం పరిశీలిస్తున్నాం. వసతిగృహాల్లో 96 వేలమంది విద్యార్థులు ఉన్నారు. వారికి ఇంకా 94 వేల మంచాలు అవసరం. పాత భవనాలు కాబట్టి మంచాలు ఉంచే వెసులుబాటు లేదు’ అని మంత్రి వివరించారు.