KRNL: పత్తికొండ మండలం ఆరటికల గుండు గ్రామ సమీపంలోని బ్రిడ్జి వద్ద రోడ్డు సరిగా లేక గుంతను తప్పించబోయి ఇవాళ ఉదయం కారు అదుపుతప్పి బోల్తా పడింది. కారులో మహిళతో పాటు నలుగురు పిల్లలు ఉన్నట్లు సమాచారం. స్థానికులు వెంటనే వారిని బయటకు తీశారు. అదృష్టవశాత్తు ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదని స్థానికులు తెలిపారు. ఈ మేరకు రోడ్డు మరమ్మతులు చేయాలని గ్రామస్థులు కోరుతున్నారు.