NLG: నార్కట్పల్లి మండలం చెరువుగట్టు గ్రామపంచాయతీ పరిధిలో కొబ్బరికాయల విక్రయానికి నేడు బహిరంగ వేలం నిర్వహించనున్నారు. గ్రామపంచాయతీ కార్యాలయ ఆవరణలో జరిగే ఈ వేలంలో పాట దక్కించుకున్న వారు ఏడాది పాటు విక్రయ హక్కులు పొందుతారని సర్పంచ్ నేతగాని కృష్ణ, కార్యదర్శి రవీందర్ రెడ్డి తెలిపారు. ఆసక్తి గలవారు ఈ వేలంలో పాల్గొనాలని వారు కోరారు.