NLR: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికలో నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ నందన్ పాల్గొని అర్జీదారుల నుంచి వినతి పత్రాలను స్వీకరించారు. 44 వినతులు స్వీకరించినట్లు అధికారులు తెలియజేశారు. ఫిర్యాదులను క్షేత్రస్థాయిలో పరిశీలించి వాటికి శాశ్వత పరిష్కారం అందించేందుకు కృషి చేస్తామని తెలిపారు.