కాకినాడ: యు. కొత్తపల్లి మండలం నాగులపల్లి రక్షిత మంచినీటి చెరువులో ఉన్న చేపలు మృతి చెందాయి. మూడు రోజుల నుండి మృతి చెందిన చేపలు అక్కడే ఉండిపోవడంతో దుర్వాసన వెదజల్లుతుంది. దీంతో 18 గ్రామాల ప్రజలు త్రాగునీరు తాగాలా వద్ద అనే సందేహంలో ఉన్నారు. వేసవకాలంలో ఇలాంటి సంఘటన చోటు చేసుకోవడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు.