TG: హిస్సార్ ఎక్స్ప్రెస్(22737)కు పెను ప్రమాదం తప్పింది. కరీంనగర్ జిల్లా మడిపల్లి శివారులో రైల్ ఇంజిన్ వీల్ విరిగిపోయింది. గమనించిన రైల్వే సిబ్బంది వెంటనే రైలును నిలిపి మరో ఇంజిన్ సహాయంలో ఉప్పల్(కమలాపూర్)కు తీసుకెళ్లారు. మరమ్మతుల అనంతరం రైలు సికింద్రాబాద్కు చేరుకుంది. ఇందుకోసం ఈ ఎక్స్ప్రెస్ను రాత్రి ఉప్పల్లో 2 గంటలపాటు నిలిపేశారు.