ASR: అరకులోయ మండలం ఎండపల్లివలసలోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలను సమగ్ర శిక్షా అభియాన్ అడిషనల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ స్వామినాయుడు ఇవాళ సందర్శించారు. 10వ తరగతి విద్యార్థులతో సమావేశమై చదువులో రాణించేలా మార్గదర్శకత్వం ఇచ్చారు. విద్యార్థులు సమయపాలనతో చదవాలని సూచించారు. ముఖ్యమైన సబ్జెక్టులను అర్థం చేసుకుని చదివి మంచి మార్కులు సాధించాలని కోరారు.