NRML: గ్రామాల్లో ప్రతిరోజూ మెరుగైన పారిశుద్ధ్యాన్ని నిర్వహించాలని అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్ అధికారులకు సూచించారు. గురువారం మామడ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా కొనసాగుతున్న పారిశుద్ధ్య పనులను ఆయన పరిశీలించారు. ఆసుపత్రి ప్రాంగణం, కార్యాలయాలు పరిశుభ్రంగా ఉండేల చూడాలన్నారు.