ప్రకాశం: బీసీవైఎం పార్టీ అధినేత బోడె రామచంద్ర యాదవ్ గురువారం కనిగిరిలో పర్యటించారు. ఈ సందర్భంగా పట్టణంలోని స్థానిక బీసీ సంఘాల నాయకులు ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ బలోపేతం, భవిష్యత్ కార్యక్రమాలపై సంక్షిప్తంగా చర్చించినట్లు నాయకులు తెలిపారు.