WNP: తాగునీటి శాశ్వత పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి పేర్కొన్నారు. వనపర్తి పట్టణంలోని రాజనగరం శివారిలో గురువారం అమృత్ పథకంలో భాగంగా జల బాండాగారాల నిర్మాణం కోసం స్థలాన్ని పరిశీలించి మాట్లాడారు. రూ.71.71 కోట్లతో నాగవరంలో 5 లక్షలు, రాజనగరంలో 6 లక్షల లీటర్ల సామర్థ్యం గల ట్యాంకులను నిర్మించనున్నట్లు ఆయన వివరించారు.