SDPT: కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండేళ్లు దాటుతున్నా, ఎన్నికల హామీ మేరకు పింఛన్ల పెంపు అమలు కాకపోవడంపై లబ్ధిదారులు నిరీక్షిస్తున్నారు. వృద్ధులు, ఒంటరి మహిళలకు రూ. 4,000, దివ్యాంగులకు రూ. 6,000 ఇస్తామని ఇచ్చిన హామీ కార్యరూపం దాల్చలేదు. ఉమ్మడి జిల్లాలోని 4,69,575 మంది పింఛన్ దారులు ఈ పెంపు ఎప్పుడు అమలవుతుందని ఎదురుచూస్తున్నారు.