NLR: బుచ్చి మండలం జొన్నవాడ శ్రీ మల్లికార్జున స్వామి సమేత కామాక్షి తాయి ఆలయంలో సౌందర్యలహరి మూక పంచశతి పారాయణం ఈనెల 7వ తేదీన నిర్వహించనున్నట్లు ఆ బృందం సభ్యురాలు నేరేళ్ల పద్మశ్రీ తెలిపారు. 500 మందితో ఈ కార్యక్రమం చేపట్టనున్నామని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వేమిరెడ్డి దంపతులు పాల్గొంటారని తెలియజేశారు.