TG: హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలంలోని ఒకే పరీక్ష కేంద్రంలో 10 మంది ఇంటర్ విద్యార్థులు డిబార్ అయ్యారు. బోర్డు పరిశీలకుడు రాఘవ నిర్వహించిన తనిఖీల్లో గణితం, పౌరశాస్త్రం, బయోకెమిస్ట్రీ పరీక్షల్లో విద్యార్థులు కాపీ కొడుతూ దొరికారు. జిల్లా వ్యాప్తంగా నిన్న వీరు 10 మంది, వరంగల్లో ముగ్గురు కలిపి మొత్తం 13 మందిపై అధికారులు డిబార్ వేటు వేశారు.