కోనసీమ: జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకుని మార్చి 8న రామచంద్రపురం టౌన్ హాల్లో మహిళలకు ప్రత్యేక జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు మంత్రి సుభాష్ కార్యాలయం నుంచి ఒక ప్రకటన విడుదల చేశారు. టెన్త్, ఇంటర్, డిప్లొమా, డిగ్రీ, బీటెక్, పీజీ చదివిన 18-28 వయసు గల మహిళా అభ్యర్థులు హాజరు కావాలన్నారు. పదవ తరగతి కనీస అర్హతతో 50 సంవత్సరాల లోపు మహిళలు సైతం హాజరుకావచ్చన్నారు.