GNTR: ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ చేయొద్దని పీడీఎఫ్ మాజీ ఎమ్మెల్సీ లక్ష్మణరావు మంగళవారం గుంటూరులో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో కోరారు. 90% మెడికల్ కాలేజీలు ప్రైవేటు చేతుల్లో ఉండగా, మిగిలిన ప్రభుత్వ కాలేజీలను కూడా విక్రయించడం అన్యాయం అని విమర్శించారు. ఇలా జరిగితే పేదలకు వైద్య విద్య అందని ద్రాక్షగా మారుతుందని అన్నారు.