KRNL: మంత్రాలయం మండలం మాలపల్లి చిలకలడోనలో ఉన్న పత్తి పంటను ఎమ్మిగనూరు ADA మహమ్మద్ ఖాద్రి, మంత్రాలయం ఏవో జీరా గణేశ్ పరిశీలించారు. ఇవాళ గ్రామాలలో ఉన్న పత్తి పంటలను పరిశీలించారు. పంటలలో ఉన్న లద్దే పురుగుల గురించి ఆందోళన చెందవద్దని రైతులకు వ్యవసాయ అధికారి జీరా గణేశ్ సూచించారు. మెగ్నీషియం లోప నివారణకు మెగ్నీషియం సల్ఫేట్ను పిచికారీ చేయాలన్నారు.