KMM: ఎర్రుపాలెం(M) తక్కెళ్లపాడు గ్రామ చెరువు సమీపంలో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో దంపతులు మృతి చెందారు. ఏపీలోని కంచికచర్ల(M) గణాత్కూరుకు చెందిన శ్రీనివాస్-రజినీ దంపతులు బైక్పై వెళ్తుండగా, ఎదురుగా వస్తున్న కోళ్ల దాణా లారీ ఢీకొట్టడంతో అక్కడికక్కడే మరణించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.