ప్రకాశం: కందుకూరులోని స్థానిక అంబేద్కర్ విగ్రహం వద్ద రైతు పోరు బాట కార్యక్రమంలో భాగంగా వైసీపీ కార్యకర్తలు వేయించిన టెంట్ను స్థానిక పోలీసులు మంగళవారం తొలగించారు. ఈ మేరకు రైతు పోరుబాటకు ఎలాంటి అనుమతులు లేకపోవడం వల్ల టెంట్లు తొలగిస్తున్నామని అధికారులు తెలిపారు.. అలానే మండలంలో 30 యాక్ట్ అమలులో ఉందని పోలీసులు కార్యకర్తలను హెచ్చరించారు..