SRD: కోహీర్ మున్సిపాలిటీలో 16 రోజుల నుంచి కమిషనర్ లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని బీఆర్ఎస్ నాయకులు విమర్శించారు. ఈ సందర్భంగా బుధవారం మున్సిపల్ కార్యాలయం వద్ద వారు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. పట్టణం బాగోగులు పట్టించుకునే అధికారి లేకపోవడంతో తమ సమస్యలు ఎవరితో చెప్పుకోవాలని నాయకులు ఆగ్రహంతో అన్నారు. ఇప్పటికైనా కమిషనర్ విధులకు హాజరవ్వాలన్నారు.