SRCL: అబుదాబి ఎయిర్ పోర్టుపై జరిగిన మిస్సైల్ దాడిలో ఎల్లారెడ్డిపేట (M) పోతిరెడ్డిపల్లికి చెందిన రాజేశ్వరరావుకి తీవ్ర గాయాలయ్యాయి. కొంతకాలంగా ఆయన దుబాయ్ ఎయిర్ పోర్టులో క్లీనింగ్ విభాగంలో పని చేస్తున్నాడు. ఇటీవల యూఏఈ ఎయిర్ పోర్టుపై ఇరాన్ మిస్సైల్ దాడి చేయగా అద్దాలు పగిలిపోయాయి. దీంతో గాజు పెంకులు రాజేశ్వర్ రావు చాతి, కుడి చేతికి తగిలి గాయాలైనట్లు ఆయన తెలిపారు.