NTR: నందిగామ నియోజకవర్గానికి ఆర్&బి శాఖ నుంచి రూ.240 లక్షల నిధులు మంజూరైనట్లు ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ప్రకటనలో తెలిపారు. రహదారుల అభివృద్ధి ద్వారా ప్రజలకు సౌకర్యవంతమైన రవాణా సదుపాయాలు అందుబాటులోకి వస్తాయని అన్నారు. దీని ద్వారా వ్యవసాయం, వ్యాపారం, విద్య, వైద్య రంగాలకు మరింత పురోగతి సాధ్యమవుతుందని ఆమె పేర్కొన్నారు.