SRCL: చందుర్తి మండలం ఎన్గల్ గ్రామ మాజీ సింగిల్ విండో డైరెక్టర్ కుసుంబ లింగయ్య సతీమణి కుసుంబ భూధవ్వ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా, బాధిత కుటుంబాన్ని వేములవాడ నియోజకవర్గ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పరామర్శించారు. మార్కెట్ కమిటీ చైర్మన్ చెలుకుల తిరుపతి, కథలాపుర్ మండలం అధ్యక్షుడు కాయితి నాగరాజు కాంగ్రెస్ పార్టీ నాయకులు గసికంటి ప్రభాకర్ పాల్గొన్నారు.